కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడిరచారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందుకోసం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం- 2009లో సవరణకు ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఈ వర్సిటీ ఏర్పాటు కోసం దాదాపు 9వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
పసుపుబోర్డు ఏర్పాటు
జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు ద్వారా పసుపుపై అవగాహనతో పాటు వినియోగం, ఎగుమతులను పెంచడం, అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. నూతన ఉత్పత్తుల్లో పరిశోధనాభివృద్ధిని ప్రోత్సహించేందుకు, సంప్రదాయ పరిజ్ఞానాన్ని జోడిరచి పసుపు ఆధారిత ఉత్పత్తులకు అదనపు విలువను జోడిరచేందుకు ఉపయోగపడనుంది. భారత్ నుంచి పసుపు ఎగుమతులు 2030 నాటికి 1 బిలియన్ అమెరికా డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు.
వంటగ్యాస్ ధర మరో రూ.100 తగ్గింపు
అలాగే ఉజ్వల పథకం కింద పేదలకు సరఫరా చేసే వంట గ్యాస్ సిలిండర్పై ప్రస్తుతం కేంద్రం రూ.200ల చొప్పున రాయితీ ఇస్తుండగా.. తాజాగా దాన్ని రూ.300లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ మార్కెట్ ధర రూ.903 ఉండగా.. ఉజ్వల లబ్దిదారులు రూ.703 చొప్పున చెల్లిస్తున్నారు. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఆ లబ్దిదారులంతా సిలిండర్కు రూ.603 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది.
కొలిక్కి రానున్న కృష్ణా జలాల వివాదం!
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి విధివిధానాలు రూపొందించాలని రెండో కృష్ణా ట్రైబ్యునల్కు మంత్రివర్గం విజ్ఞప్తి చేసిందన్నారు. ఈ నిర్ణయం వల్ల 50లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటాను తేల్చాలని తెలంగాణ కోరుతోందన్నారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.