TS SSC Results : తెలంగాణ పదోతరగతి ఫలితాల విడుదల !

0

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు. టెన్త్‌ ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 

నిర్మల్‌ జిల్లా ఫస్ట్‌ !

ఈ ఏడాది టెన్త్‌ వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించారు. వీటికి 5,08, 385 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. టెన్త్‌ ఫలితాల్లో నిర్మల్‌ జిల్లా టాప్‌.. వికారాబాద్‌ లాస్ట్‌ స్థానంలో నిలిచింది. నిర్మల్‌ జిల్లా 99.05% ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది.అతి తక్కువగా వికారాబాద్‌ జిల్లా 65.10% ఉత్తీర్ణత నమోదై చివరి స్థానంలో నిలిచింది. ఈ వెబ్‌సైట్స్‌ ద్వారా ఫలితాలను త్వరగా తెలుసుకోండి 

http://results.bse.telangana.gov.in/

http://results.bsetelangana.org/

http://bse.telangana.gov.in/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !