JEE MAIN 2024 లో కొనసాగిన తెలుగు విద్యార్థుల సత్తా !

0

జేఈఈ మెయిన్‌ 2024 (సెషన్‌-2) ఫలితాలు వచ్చేశాయ్‌.. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరోసారి జాతీయస్థాయిలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించగా.. వీరిలో 22 మంది తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం. ఈ ఘనతను సాధించిన వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్‌ 22న జేఈఈ మెయిన్‌ తుది కీ విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ కన్నా ఒకరోజు ముందే రిజల్ట్స్‌ను వెబ్‌ సైటులో అందుబాటులో ఉంచింది. అదే విధంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల ర్యాంకుల వివరాలను ప్రకటించింది. విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి స్కోర్‌ కార్డులను పొందొచ్చు. 

సెషన్‌ -1లో  23 మందికే 100 పర్సంటైల్‌!

జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌- 1 పరీక్షకు 12,21,624 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 4 నుంచి 12వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌ -2 పరీక్షకు 12.57లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మొత్తంగా రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ను సైతం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా టాపర్స్‌ వివరాలను ప్రకటించింది

27 నుంచి ‘అడ్వాన్స్‌డ్‌’కు దరఖాస్తులు

జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు వీలు కలగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఏప్రిల్‌ 27 నుంచి మే 7 వరకు ఐఐటీ మద్రాస్‌ దరఖాస్తులు స్వీకరించనుంది. మే 17 నుంచి 26 వరకు అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌ -1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ -2 పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను జూన్‌ 9న ప్రకటిస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !