- తండ్రిపై ముద్రగడ కుమార్తె క్రాంతి ఆగ్రహం !
- ఆలోచనా విధానం మారలేదని నిట్టూర్పు !
ముద్రగడ పద్మనాభరెడ్డిపై కుమార్తె క్రాంతి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలపై ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తన తండ్రి పేరు మార్చుకున్నా.. ఆయన ఆలోచనా విధానం మారలేదన్నారు. ‘మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని , ఆయన ఆలోచానా విధానం మార్చుకోకపోవటం ఆందోళనగా ఉన్నది. జగన్ మోహన్ రెడ్డి గారిని ఏనాడూ ప్రశ్నించని ఆయన , పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఆయనకు ఉందా?’ అని ప్రశ్నించారు. ఒకసారి, తనపేరును పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాక, కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువత భవిష్యత్ ఆశాజ్యోతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయం ఆయనకు ఎందుకో అర్ధం కావడం లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయాలో ఆయనకు స్పష్టత ఉంది. ఏమి చేయాలో మా తండ్రి గారికే స్పష్టత లేదు అనిపిస్తున్నది. శేషజీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా ఒక కూతురుగా సలహా ఇస్తున్నాను. మళ్ళీ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే, నేను గట్టిగా ప్రతిఘటిస్తాను’అంటూ ట్వీట్ చేశారు.
జనసైనికులను పవన్ మందలించాలి !
తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన పేరును మార్చుకున్నా.. కొందరు ఇప్పటికీ టార్గెట్ చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నారు. జనసైనికులు తనపై బూతులతో దాడి చేస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదని పవన్ కళ్యాణ్ జనసైనికుల్ని మందలించాలన్నారు. ఇలా బూతులు తిట్టడం కంటే తమ కుటుంబాన్ని ఒకేసారి చంపేయండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇలాంటివి సరికాదని.. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు ముద్రగడ. అలాగే రాష్ట్రంలో దాడులు జరగకుండా టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచన చేయాలన్నారు.
మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని ,అయన అలోచానా విదానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉన్నది.
— Kranthi Barlapudi (@kr_barlapudi) June 21, 2024
జగన్ మోహన్ రెడ్డి గార్ని ఏనాడూ ప్రశ్నించని అయన , పవన్ కళ్యాణ్ గార్ని ప్రెశ్నించే అర్హత ఆయనకు ఉందా?
ఒకసారి,…