రికార్డులను చెరుపుకుంటూ పోతున్న నీరజ్‌ చోప్రా !

0

జావెలిన్‌ త్రోలో భారత స్టార్‌ ఆటగాడు అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా మరో రికార్డును నెలకొల్పాడు. ఫిన్‌లాండ్‌ లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్‌ లో 89.30 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రికార్డు సృష్టించాడు. గత ఏడాది మార్చిలో పాటియాలాలో జరిగిన పోటీల్లో 88.07 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి నీరజ్‌ చోప్రా జాతీయ రికార్డును క్రియేట్‌ చేశాడు. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించాడు. గత ఏడాది ఆగస్టులో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌ లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ ను 87.58 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. నుర్మి గేమ్స్‌లో చోప్రా రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు. ఫిన్‌ లాండ్‌ అథ్లెట్‌ ఒలివర్‌ హిలాండర్‌ జావెలిన్‌ ను 89.83 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !