parents-demand-royalty-for-rankers : ర్యాంకులు వాడుకుంటే రాయల్టీ కట్టాల్సిందే...తల్లిదండ్రుల కొత్త వాదన !

0

కార్పొరేట్‌ కాలేజీలకు చుక్కలు చూపించేందుకు తల్లిదండ్రులు సిద్ధం అవుతున్నారు. తమ పిల్లల ర్యాంకులు వాడుకుని వ్యాపారం చేసుకుంటున్న కార్పొరేట్‌ కాలేజీల ఆగడాలు సాగనివ్వమని నినదించారు. ఇక నుండి పిల్లల ర్యాంకులు వాడుకునే కార్పొరేట్‌ కాలేజీలు తప్పని సరిగా రాయల్టీ చెల్లించాల్సిందే అని డిమాండ్‌ చేస్తున్నారు. స్కూల్స్‌ నుండి కాలేజీ వరకు లక్షలకు లక్షలు ఫీజు ముక్కుపిండి వసూలు చేసే కార్పొరేట్‌ కాలేజీలు మా పిల్లల ర్యాంకులు ఉచితంగా ఎలా వాడుకుంటారు. ఇది ఎంత వరకు సమంజసం ? ర్యాంకు వాడుకున్నందుకు గాను రాయల్టీ రూపంలో మేము అడిగినంత సొమ్ము చెల్లించాల్సిందే పట్టుబడుతున్నారు. దీని కోసం అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమే అని పేరేంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రకటిస్తున్నారు. ఒకవేళ మీరు చదువు చెబితేనే మా పిల్లలకు ర్యాంకులు వస్తే, మీ కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్కరికీ మీరు చెప్పే మంచి ర్యాంకు రావాలి కదా అని వారి వాదన వినిపిన్నారు. మీరు చదువు చెప్పినందుకు అడిగినంత ఫీజు చెల్లిస్తున్నాం కదా. మా పిల్లల ర్యాంకులు వాడుకునే హక్కు మీకు లేదు అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకువస్తున్నారు. మా పిల్లల ర్యాంకులు వాడుకుని మీరు బిజినెస్‌ చేసుకోవటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. అవును, ఇదీ నిజమే కదా. కొర్పొరేట్‌ సంస్థలు చేసేది వ్యాపారం అయినప్పుడు, ఆ ర్యాంకులు ప్రకటనలకు వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించటం న్యాయమే అని ఇతర విద్యార్థి సంఘాలు మాట కలుపుతున్నారు. చూద్దాం ఈ వాదన ఏ మలుపు తీసుకుంటుందో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !