తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ప్రారంభమైంది. ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి యాత్రను ప్రారంభించారు. అనంతరం చంద్రగిరి బజారువీధిలో.. ప్రవీణ్రెడ్డి ఇంటికి భువనేశ్వరి వెళ్లారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ సోషల్ మీడియాలో ప్రవీణ్రెడ్డి యాక్టివ్గా పనిచేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో అదే ఆలోచనతో ఈనెల 18వ తేదీన ఆవులపల్లి ప్రవీణ్ రెడ్డి మృతి చెందారు. ఆయా కుటుంబాలకు చెరో రూ.3లక్షల చెక్కును అందజేశారు. ధైర్యంగా ఉండాలని.. తామంతా అండగా ఉంటామని భువనేశ్వరి వారికి భరోసా ఇచ్చారు. వారానికి మూడు రోజులపాటు ఈ యాత్ర జరగనుంది. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొంటారు. నారా భువనేశ్వరి తొలి విడత చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈ మూడు రోజులూ ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ వివిధ కారణాలతో మృతి చెందిన టీడీపీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మహిళలతో ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొంటారు. తొలి రోజైన బుధవారం 25న చంద్రగిరిలో సమావేశంలో పాల్గొంటారు. 26న గురువారం తిరుపతిలో, 27న శుక్రవారం శ్రీకాళహస్తిలోనూ పర్యటిస్తారు.
లోకేష్ సమర్థుడైతే తల్లిని రోడ్ల మీదకు ఎందుకు పంపుతారు ` కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు !
