గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ప్రమాదానికి కారణమేంటనే దానిపై స్పష్టత రానప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కూలిన తర్వాత ఘటనా స్థలంలో ఏకంగా 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడిరచారు. దీంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు. విమానం ప్రమాదానికి గురైన విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, మంటలు వ్యాపించడంతో ఎవరినీ కాపాడే పరిస్థితి లేకుండా పోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడిరచిన సంగతి తెలిసిందే. దీనిపై ఎస్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు స్పందించారు. ‘‘ప్రమాదం గురించి సమాచారం రాగానే మధ్యాహ్నం 2-2.30 గంటల ప్రాంతంలో మా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అంతకుముందే హాస్టల్లో శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని స్థానికులు కాపాడారు. మంటలు వ్యాపించడం ఎక్కువైన తర్వాత పరిస్థితి చేదాటిపోయింది’’ అని అధికారి వివరించారు.
ఇలాంటి విపత్తు ఇంతకు ముందు చూడలేదు.
‘‘గతంలో మేం ఎన్నో సహాయక చర్యలు చేపట్టాం. కానీ, ఇలాంటి విపత్తును ఇంతకుముందెప్పుడూ చూడలేదు. విమానంలోని ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడిరది. క్షణాల వ్యవధిలోనే అక్కడి ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది. దీంతో బయటపడే అవకాశం లేకుండా పోయింది. మేం పీపీఈ కిట్లు వేసుకొని ఘటనాస్థలానికి చేరుకున్నా.. వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. పక్షులు, శునకాలు కూడా పారిపోలేనంత స్థాయిలో ఉష్ణోగ్రత ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలు పక్షులు, శునకాలు కాలిబూడిదయ్యాయి. ఎటుచూసినా శిథిలాలే కన్పించాయి. వాటి కింద తీవ్రంగా కాలిపోయిన ప్రయాణికులను గుర్తించడం సవాల్గా మారింది’’ అని మరో అధికారి ఆ భయానక దృశ్యాలను గుర్తుచేసుకున్నారు. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు వైద్యకళాశాల హాస్టల్లో ఉన్న 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలకు అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. ప్రమాదం ధాటికి చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయి. దీంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు.