- పదే పదే కూటమి నేతల ప్రస్తావన !
- కూటమి ప్రభుత్వం జగన్కు పద్మవ్యూహం పన్నుతుందా ?
- ప్రజల్లో ఒక రకమైన మూడ్ను క్రియేట్ చేస్తున్న కూటమి నేతలు.
- జగన్ను అధికారంలోకి రాకుండా చేసే అస్త్రాలు నిజంగా కూటమి దగ్గర ఉన్నాయా ?
మొన్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావొచ్చేమో, వస్తే పరిస్థితి ఏంటి ? చాలా మందికి ఒక ఆలోచన ఉండవచ్చు. జగన్ ప్రభుత్వం మళ్ళీ రాదు, రానివ్వం. మీకు భరోసా ఇస్తున్నా. మీకు నమ్మకంగా చెప్తున్నా. కూటమి ప్రభుత్వం 15`20 ఏళ్ళు అధికారంలో ఉండాలని మేము మాట్లాడుకున్నాం. ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితిల్లో నేను లేను, ఎవరూ లేము. అని ప్రజలకు హామీ ఇచ్చారు.
నేడు ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పెట్టుబడిదారులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ పాలన చేదు అనుభవాలను మరచిపోయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. నేను ఈసారి ఏమరుపాటుగా లేను. ఎన్డీయే ప్రభుత్వమే మున్ముందూ కొనసాగేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నా. నాదీ భరోసా. నిర్భయంగా పెట్టుబడులు పెట్టండి’ అని పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఆస్త్రాలు ఉన్నాయా ?
కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో అధికారంలో కొనసాగుతుందని నమ్మకంగా ఉన్నారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ మాటల వెనకున్న మర్మం ఏంటి? వాళ్లది ధైర్యమా? వైసీపీ కోలుకునే అవకాశం లేదన్న ధీమానా ? లేక కూటమి దగ్గర ఇంకేమైనా అస్త్రాలు ఉన్నాయా?
పవన్ క్లారిటీ !
జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్లకార్డుల ప్రదర్శన తర్వాత ఏపీ పాలిటిక్స్లో రాజకీయ వేడి రాజుకుంది. డైలాగ్ వార్తో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ, జగన్ టార్గెట్గా పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తొక్కి నార తీస్తామని, మక్కెలు విరగగొట్టి కూర్చోబెడతామంటున్నారు పవన్. అసాంఘిక శక్తులను ఏరివేస్తామన్నారు. రోడ్లెక్కి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలు ఊరుకోమంటున్నారు. గొంతు కోస్తామని అంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. సరదాగా ఇక్కడ ఎవరూ కూర్చోలేదంటున్న పవన్..అధికారంలో ఉన్నపుడు అరాచకాలు సృష్టించారని ఇపుడు కూడా అలాగే చేద్దామనుకుంటే లైట్ తీసుకునే ప్రసక్తే లేదంటున్నారు. అంతే కాదు కూటమి ఐక్యతకు తాను ప్రాధాన్యత ఇస్తాననని 20 ఏళ్లు కూటమే అధికారంలో కొనసాగుతుందని క్లారిటీగా చెబుతున్నారు పవన్. మళ్లీ జగన్ ప్రభుత్వం రానే రాదు..తాను మాట ఇస్తున్నానంటున్నారు పవన్. కనీసం పదిహేనేళ్లు కూటమి పవర్లో ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
చంద్రబాబు ధీమా !
మరోవైపు సీఎం చంద్రబాబు మాట తీరులోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఆలోచన బాబు ప్రసంగాల్లో స్పష్టమవుతోంది. అన్నీ చేసేశామని చెప్పటం లేదు కానీ..ఊహించిన దానికంటే ఎక్కువగా..చెప్పనివి కూడా చేశామని మాత్రం చెప్పగలను అంటున్నారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడ ప్రయాణం మొదలైందో..ఏడాదిలో ఏం సాధించామో ప్రజలే విశ్లేషించుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ స్కీమ్లలో చాలావరకు అమలు చేశారు. ఇంకా ఒకటో, రెండో స్కీమ్లు పెండిరగ్లో ఉంటే..వాటిని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామో షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. ఇక రోడ్లు బాగు చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతున్నారు. పైగా వైసీపీ వ్యవహరిస్తున్న తీరు తమకు ప్లస్ పాయింట్ గా మారుతుందని భావిస్తున్నారట కూటమి పెద్దలు. అపోజిషన్లో ఉన్నప్పటికీ అరాచకాలు, అడ్డగోలు మాటలు.. మాట్లాడుతున్నారని..వైసీపీని ప్రజలు ఓడిరచిందే అందుకని..రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని అంచనా వేస్తున్నారట కూటమి లీడర్లు. పైగా మళ్లీ కూటమిగా వెళ్తామని చెప్పడం ద్వారా పబ్లిక్ మూడ్ను మరింతగా తమవైపునకు తిప్పుకునే ఆలోచనతోనే ముందుకు వెళుతున్నట్లు స్పష్టం అవుతోంది.
పద్మవ్యూహాలను జగన్ దాటగలరా ?
అయితే అటు చంద్రబాబు, ఇటు పవన్ మాటల్లో అయితే వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. దీని వెనుక మర్మమేంటన్న దానిపై మాత్రం పెద్దఎత్తున డిస్కషన్ జరుగుతోంది. అయితే పవన్ మాటలను లైట్ తీసుకోలేమని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. సేమ్టైమ్ పవన్ అంత నమ్మకంతో చెప్తున్నారంటే కూటమి దగ్గర ఫ్యూచర్ ప్లాన్స్ ఉండే ఉంటాయంటున్నారు. స్కీముల అమలుతో పాటు పెద్ద ఎత్తున అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలతో ఆకట్టుకోవటంతో పాటుగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, మద్యం, ఇసుక, భూ కుంభకోణాలతో పాత కేసులతో జగన్ను పాలిట శాపంగా మారేలా పకడ్బందీగా స్కెచ్ వేస్తున్నారా ? జగన్ కేసుల్లో ఇప్పటికీ పురోగతి లేకపోవటంతో వాటిపైన దృష్టిపెట్టి దోషిగా నిరూపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంత కాన్ఫిడెంట్గా కూటమి ప్రభుత్వ నాయకులు భరోసా ఇస్తున్నారు అంటే జగన్పై దీర్ఘకాలిక ప్లాన్తో ముందుకు సాగుతున్నట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ జగన్ ఈ ఉచ్చుల నుండి తప్పించుకుంటారా ? ఒంటరి పోరుతో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటారా ? అనేది కాలమే నిర్ణయించాలి.