NEET (UG) RESULTS : నీట్‌లో తెలుగోడి సత్తా !

0

  • జాతీయస్థాయిలో 18 వ ర్యాంక్‌తో మెరిసిన తెలుగు తేజం !
  • తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్‌ ర్యాంక్‌ కైవశం చేసుకున్న నారాయణ విద్యార్థి !

నీట్‌ (యూజీ) 2025 ఫలితాలు విడుదలైయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుండి కాకర్ల జీవన్‌ సాయి కుమార్‌ ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 18 వ ర్యాంకు సాధించి తెలుగోడి సత్తా చాటాడు. అలాగే సౌతిండియాలో ఫస్ట్‌ మార్క్‌ సాధించి సంచలనం సృష్టించాడు. ఇతర పోటీ పరీక్షలాగా కాకుండా నీట్‌కు ఎంతో కఠోర శ్రమ అవసరం. అలాగే సాధించాలన్న సంకల్పం, విషయ నైపుణ్యం అన్నింటినీ మించి ప్రతి విషయంపై స్పష్టత అవసరం. అప్పుడే అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతారు. అలా అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి నారాయణ మార్గదర్శిగా నిలిచిందని జీవన్‌ సాయికుమార్‌ పేర్కొన్నాడు. 

విశ్లేషిస్తూ చదివితే విజయం 

ఈ ఏడాది నీట్‌ పరీక్ష ఎంతో సంక్లిష్టంగా ఉంది. అందులో 720 మార్కులకు గాను 670 మార్కులు దాటారంటే మామూలు విషయం కాదు. మూడు సబ్జెక్టులనూ ఆపోశన పడితే కానీ అది సాధ్యం కాదు. ఎంతో కష్టపడి చదివి 670 మార్కుల మార్కుని అందుకున్న హైదరాబాద్‌ కుర్రాడు కాకర్ల జీవన్‌ సాయి కుమార్‌ ... నీట్‌లో ప్రతి ప్రశ్ననూ ఎదుర్కొనేంత విషయ పరిజ్ఞానం రావాలంటున్నాడు. అదే తనకు ఆలిండియా 18 వ ర్యాంకు తెచ్చిపెట్టిందంటూ తను సన్నద్ధమైన తీరుని ఇలా చెప్పుకొచ్చాడు.. 

చిన్నతనం నుంచే వైద్యరంగమంటే ఇష్టం

మేము ఉండేది హైదరాబాద్‌. మా స్వగ్రామం దేవరపల్లి మండలం, దుద్దుకూరు. నాన్న ప్రొఫెసర్‌ గంగాధర నాగకుమార్‌, మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో కంఫ్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌, అమ్మ నళినీదేవి గృహిణి. నా చదువంతా హైదరాబాద్‌లోనే జరిగింది. 6 వ తరగతి నుండి నారాయణ సిఓ స్కూల్స్‌లో చదివాను. సీబీఎస్‌ఈలో టెన్త్‌లో 90 శాతం, ప్లస్‌టు మాదాపూర్‌ నారాయణ కాలేజీలో 98 శాతం మార్కులొచ్చాయి. అక్కడే నీట్‌ శిక్షణ కూడా తీసుకున్నాను. చిన్నతనం నుంచే వైద్యరంగమంటే ఇష్టం. దానికి నా తల్లిదండ్రులే ప్రేరణ. చిన్ననాటి నుండే ఈ రంగానికి రావాలనే ఆలోచనకు బీజం పడిరది. ఆ వైపు అడుగులేసేందుకే బైపీసీ తీసుకున్నాను. ఆ తర్వాత నీట్‌కి సన్నద్ధమయ్యాను. ఆలిండియా ర్యాంకు కోసం అహర్నిశలు కష్టపడ్డాను. అందుకు తగ్గట్టే ఆలిండియా 18 వ ర్యాంకు సాధించాను.  సాధారణంగా స్టడీస్‌లో నేను సగటు విద్యార్థినే. కానీ వైద్యరంగంపై మక్కువతో చదివాను, ఆఖరికి సాధించాను. 

నారాయణ గైడెన్స్‌తోనే సాధించాను.

నీట్‌కు సన్నద్ధమవ్వాలంటే ఏ విషయమైనా పరీక్షలు, ప్రశ్నలు అనే కోణంలో కాకుండా దానిపై పూర్తి అవగాహన వచ్చేలా విశ్లేషిస్తూ చదవాలి. ప్రతి అంశాన్నీ విశ్లేషించి అవగాహనతో ముందుకు తీసుకుపోయే ప్రణాళిక ఉండాలి. ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో ముందుకు వెళితేనే ఆత్మవిశ్వాసం బలపడుతుంది. దీనికి నారాయణ పరీక్షా విధానం, మార్కుల విశ్లేషణ, సందేహాల నివృత్తి, మైక్రోషెడ్యూల్‌, ఎర్రర్‌ లిస్ట్‌, రివిజన్‌ ప్రోగ్రామ్‌ ఎంతగానో సహాయపడిరది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !