మాజీ మంత్రి నారాయణకు సంస్థల్లో ఏపీ సిఐడీ సోదాలు !

0

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకులు నారాయణకు చెందిన హైదరాబాద్‌ మాదాపూర్‌లోని  NSPIRA సంస్థలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో చట్ట విరుద్దంగా అస్సైన్డ్‌ భూముల కొనుగోలుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్‌ సంస్థలోకి భారీగా నిధులు మళ్లించినట్టు CID అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ డబ్బుతో బినామీ పేర్ల మీద పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఐడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

కేసు పూర్వాపరాలు ఏమిటంటే ?

అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనితో CID కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా మాజీ మంత్రి నారాయణలపై జIణ కేసులు నమోదు చేసింది. చంద్రబాబును A-1గా, నారాయణను A-2గా సీఐడీ చేర్చగా ఫిర్యాదు ఆధారంగా 120బి, 34, 420, 36,37,166 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  కాగా ఆ ఫిర్యాదులో 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్టుగా పేర్కొన్నారు. అంతేకాదు ఆలైన్‌మెంట్‌ మార్పుతో రామకృష్ణ హోసింగ్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌,  LEPL ప్రాజెక్ట్స్‌, లింగమనేని అగ్రికల్చర్‌ ఫామ్స్‌, జయని ఎస్టేట్స్‌ కు లబ్ది కలిగించారని ఆరోపించారు.

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కేసులో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై నారాయణ హైకోర్టులో సవాల్‌ చేశారు. కోర్టు నుంచి అనుమతి పొంది అమెరికాలో చికిత్స చేసుకున్నారని నారాయణ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు ఇటీవల ఆయన ఇంట్లోనే అధికారులు స్టేట్‌ మెంట్‌ రికార్డ్‌ చేశారు. ఇక ఇప్పుడు సోదాలతో మరోసారి కలకలం రేగింది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !