AP SSC RESULTS : ఆంధ్రప్రదేశ్‌ టెన్త్‌ రిజల్ట్స్‌ రిలీజ్‌ !

0

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. రికార్డుస్థాయిలో తక్కువ రోజుల వ్యవధిలోనే పరీక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారాయన. మార్చి 18 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6.23 లక్షలు కాగా, గత ఏడాది ఫెయిల్‌ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం టెన్త్‌ పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేసినట్లు, విద్యా సంవత్సరం ముగియక ముందే ఫలితాలు ప్రకటిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. ఫలితాల కోసం   వెబ్‌సైట్‌ని సందర్శించండి. https://result.bse.ap.gov.in/  

ఇంకా  ఆయన ఏమన్నారంటే..

  • 6.23 లక్షల మంది  విద్యార్థుల టెన్త్‌ పరీక్షలు పరీక్షలు రాశారు
  • టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి
  • బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17
  • మొత్తంగా 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారు
  • ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌..  93.7 శాతం రిజల్ట్‌
  • ఫలితాల్లో చివరి స్థానంలో కర్నూలు జిల్లా (67 శాతం)
  • 2,300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత
  • ఒక్కరూ పాస్‌కాని స్కూల్స్‌ 17
  • మే 24 నుంచి జూన్‌ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !