Rave Party in Bengaluru : బెంగళూరులో రేవ్‌ పార్టీ భగ్నం ! పలువురు తెలుగు సినీ ప్రముఖులు !!

0

బెంగళూరులో ఓ రేవ్‌ పార్టీని అక్కడి సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) భగ్నం చేశారు. నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో ఓ ఫాం హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. స్థానిక జీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించినట్లుగా బెంగళూరు సీసీబీకి సమాచారం అందడంతో వారు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రేవ్‌ పార్టీలో భారీగా లిక్కర్‌ తో పాటుగా పెద్ద ఎత్తున డ్రగ్స్‌ కూడా యువతీయువకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యక్తికి చెందినది పోలీసులు గుర్తించారు. ఆయన గోపాల్‌ రెడ్డికి చెందినదని పోలీసుల విచారణలో తేలింది. ఈయన ఫామ్‌హౌస్‌లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది..? తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్‌ చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్‌ ఏంటి..? పుట్టినరోజును ఇంత గ్రాండ్‌గా ఎందుకు ప్లాన్‌ చేశారు..? 100 మందిని పిలిచారు.. ఇందులో వీవీఐపీలు, సెలబ్రిటీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే రేవ్‌ పార్టీలో పోలీసులు మాదక ద్రవ్యాలను భారీగా గుర్తించారు. ఈ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారని తెలిసింది. ఈ రేవ్‌ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ పేరుతో పాస్‌ ఉన్న కారు కూడా గుర్తించినట్లు తెలిసింది. సీసీబీ సోదాల్లో ఎండీఎంఏ సహా పలు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిని సీసీబీ అదుపులోకి తీసుకుంది. అయితే, సినీ నటి హేమ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లుగా వదంతులు వచ్చాయి. దీనిపై ఆమె స్పష్టత ఇచ్చారు. ఈ రేవ్‌ పార్టీలో దాదాపు 70 మంది యువకులు, 30 మంది వరకూ యువతులు పాల్గొన్నట్లు తెలిసింది. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌ హౌస్‌ పరిసరాల్లో జాగ్వార్‌, బెంజ్‌ సహా ఖరీదైన 15 ఖరీదైన కార్లను జప్తు చేశారు. ఐదుగురిని అరెస్టు చేసిన ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వారందరినీ అదుపులోకి తీసుకొని డ్రగ్స్‌ సేకరించిన వారిని గుర్తించడం కోసం మెడికల్‌ టెస్టులు చేయించారు. ఈ రేవ్‌ పార్టీ కోసం హైదరాబాద్‌ నుంచి విమానంలో వచ్చి మరీ పలువురు హాజరైనట్లు తెలిసింది. 

అదుపులో 25 మంది అమ్మాయిలు

కన్నడ సినీ పరిశ్రమలో ఈ వార్త సంచలనంగా మారింది. ఓ స్టార్‌ హీరో కూతురు, అవార్డ్‌ విన్నింగ్‌ స్టార్‌ డైరెక్టర్‌ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. డ్రగ్స్‌ తీసుకొని బాగా ఎంజాయ్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు ఈ పార్టీకి హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో పలు టీవీ నటులు, నటీమణులు ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్నవారిలో 25 మంది అమ్మాయి ఉన్నారు.


తనకు సంబంధం లేదన్న కాకాణి గోవర్థన్‌ రెడ్డి !

ఇదిలా ఉండగా సంఘటనా స్థలంలో ఏపీ 26సిఏ 777 వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు పలు టాప్‌ బ్రాండ్‌ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేవ్‌ పార్టీ ఏర్పాటు ద్వారా నిర్వహకులు ఒక్క రోజుకు రూ.30లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. పార్టీకి హాజరైన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఏపీ,తెలంగాణ నుంచి సినీ తారలను పార్టీకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 15కార్లను సీజ్‌ చేశారు. బెంగుళూరు రేవ్‌ పార్టీతో తనకు సంబంధం లేదని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ప్రకటించారు. కారుపై ఉన్న స్టిక్కర్‌ గడువు 2023తో ముగిసిందని స్పష్టం చేశారు. కారుపై స్టిక్కర్‌ ఎలా వచ్చిందో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. కారుపై ఉన్న స్టిక్కర్‌ ఒరిజినలా డూప్లికేటా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉందన్నారు. 


నేను హైదరాబాద్‌ లోనే ఉన్నా - హేమ

‘‘నేను హైదరాబాద్‌ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్‌ పార్టీతో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !