ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ లొల్లి...బండి సంజయ్‌ అరెస్ట్‌ !

0


ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ లొల్లి తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్సీ కవితపై ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేతల నిరసనలు, ఆందోళనలు పీక్స్‌ చేరుకున్నాయి. ఈ క్రమంలో దీక్షకు దిగిన తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు జనగామలో అరెస్ట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడి వ్యవహారంపైనే పోలీస్‌ కంప్లైంట్‌ నమోదైంది. 26మంది బీజేపీ నాయకులు, కార్యకర్తల మీద బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.దాడి చేసిన వారిలో పలువుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐపీసీ 341, 147, 148, 353, 332, 509. 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీజేపీ శ్రేణులపై కేసులు, అరెస్ట్‌ను నిరసిస్తూ మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్‌ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిభిరం దగ్గర బండి సంజయ్‌ దీక్షకు దిగారు. దీంతో పోలీసులు చేరుకొని దీక్షనుభగ్నం చేశారు. ఆయన్ని అరెస్ట్‌ చేశారు. ఈక్రమంలో పోలీసులతో బీజేపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అరెస్ట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బలవంతంగా బండి సంజయ్‌ని అరెస్ట్‌ చేశారు. పోలీసుల వాహనాన్ని అఢ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ శ్రేణులను బలవంతంగా పక్కకు నెట్టివేయడంతో పలువురికి గాయాలయ్యాయి. బండి సంజయ్‌ని పోలీసులు జీపులో ఎక్కించుకొని వరంగల్‌ జిల్లా చిలుపూర్రు గుట్ట వైపుగా తీసుకెళ్తారు.

ఈ నేపథ్యంలో బీజేపీ నేతల ఆరోపణలు, ఆందోళనలపై టీఆర్‌ఎస్‌ నేతలు స్పందించారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ఎల్వీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ-ఐటీ కేసు వివరాలు బీజేపీ వాళ్లకు ముందే ఎలా తెలుస్తాయి. మా బతుకమ్మ జోలికి వస్తే, మీ బతుకులు ఆగం అయిపోతాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసి, రౌడీయిజం చేస్తారా?. రౌడీయిజం కాకుండా మళ్లీ దీక్షలు, నిరసనలా? అని ప్రశ్నించారు.  ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు కీలు బొమ్మలుగా మారాయి. కార్పొరేట్లు అంబానీ, అదానీ చేతిలో మోదీ కీలుబొమ్మగా మారిపోయారు. దర్యాప్తు సంస్థలు ఎవరి మీదనైనా దాడులు చేయాలంటే.. వారు మోదీకి వ్యతిరేకులైనా అయి ఉండాలి.. లేదా బీజేపీలో చేరనివారైనా అయి ఉండాలన్నారు. 

మరోవైపు.. కవిత ఇంటి వద్ద ఆందోళనల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేటర్లు.. ఆమె ఇంటికి చేరుకుని సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. భౌతిక దాడులు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పార్టీ మంత్రులు, కార్యకర్తలు, వేలాది మంది సైన్యం మీలాగే ఆలోచిస్తే.. మీరు(బీజేపీ నేతలు) మిగులుతారా?. మీ పార్టీ ఆఫీసులు, ఇళ్లు ఉంటాయా అని హెచ్చరించారు.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !