Balayya in YuvaGalam Padayatra : వైసీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు

0


  • యువగళం పాదయాత్రలో పాల్గొని సంఫీుభావం తెలిపిన బాలకృష్ణ
  • వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు 

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ సర్వనాశనమైందని తెదేపా ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా శింగనమలలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో బాలయ్య పాల్గొని సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్‌కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

అభివృద్ధి శూన్యం

‘‘జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదన్నారు. ‘‘చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉంది. అధికారంలోకి మళ్లీ సైకో వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. ఎవరినైనా బెదిరించవచ్చని జగన్‌ చూస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. చాలా మంది మా పార్టీతో టచ్‌లో ఉన్నారు. తెదేపాలో చేరి ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రికి పబ్‌జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. వైకాపా ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు. వైకాపా అరాచకాలను ఎదిరించేందుక ప్రజలంతా ముందుకు రావాలి. తెదేపా పాలన మళ్లీ వస్తుంది.. అందరి సమస్యలు పరిష్కరిస్తుంది’’ అని బాలయ్య అన్నారు.

‘‘ఓటే మీకు ఆయుధం. అదే మీకు రక్షణ. 

రాష్ట్రంలో రాజధాని ఎక్కడుంది? బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ? వంటివి చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకూ పోలవరం ఊసే ఎత్తలేదు. రూ.8 లక్షల కోట్ల అప్పులు ఎవడబ్బ సొమ్ము? సరే చేశారు. దానితో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అంతా శూన్యం. పెన్షన్లు పెండిరగ్‌.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. గంజాయిలో నంబర్‌ 1 స్థానంలో ఉన్నాం. ఇక రేట్ల విషయానికి వస్తే.. విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ, పెట్రోల్‌, డీజిల్‌, ఇంటి పన్నులు, ఆఖరికి చెత్త మీద కూడా పన్నువేసే పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. ఏ నియోజకవర్గంలో చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు శాండ్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా పేరిట ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. అలాగే ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులు వేయడం, బెదిరించడం, హత్యా రాజకీయం చేస్తున్నారు. ఐదు కోట్ల మంది కలల రాజధాని అమరావతి గురించి ఊసే లేదు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు ఎక్కడ అడ్డంకి అవుతారోనని వాళ్లు ఏం చేసినా అడ్డుకుంటున్నారు. ప్రత్యేక హోదా అన్నారు అదీ లేదు. ఇవన్నీ జనాలకు తెలియాలి’’ అని బాలయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీయే కాదు. ప్రతి ఒక్కరూ విజృంభించాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తపడి కళ్లు తెరవాలని బాలయ్య పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !