తన ఇమేజ్కి సరిపోయేలా కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకుసాగుతున్న యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ తన స్టైల్ మార్చి ‘గం గం గణేశా’ సినిమాతో వచ్చాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీ వాత్సవ, నయన్ సారిక హీరోయిన్స్ గా తెరకెక్కిన ‘గం గం గణేశా’ సినిమా నేడు మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాని నిర్మించారు. ఇప్పుడు క్రైమ్ కామెడీ జానర్లో యాక్షన్ అంశాలు మేళవించిన ‘గం గం.. గణేశా’ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది.
కథేంటంటే
గణేశ్ (ఆనంద్ దేవరకొండ) అనాథ. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయేల్)తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి శ్రుతి (నయన్ సారిక) డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో ఎలాగైనా తానూ ధనవంతుడు కావాలనుకుంటాడు. దీంతో ఓ నగల దుకాణంలో రూ.7 కోట్ల విలువైన వజ్రాన్ని దొంగతనం చేసే డీల్ ఒప్పుకొని ఆ పని పూర్తి చేస్తాడు. అత్యాశకు పోయి ఆ వజ్రాన్ని తానే విక్రయించి డబ్బు సంపాదించాలనుకుంటాడు. వజ్రాన్ని చెన్నై తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో భయపడి అటుగా వెళ్తున్న భారీ వినాయకుడి విగ్రహం తొండంలో దాన్ని పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్రెడ్డి (రాజ్ అర్జున్) ఆర్డర్ మేరకు ఆ వినాయకుడి విగ్రహాన్ని ముంబయిలో ప్రత్యేకంగా తయారుచేయించి, ఊరికి తీసుకొస్తుంటాడు కిరాయి రౌడీ రుద్ర (కృష్ణ చైతన్య). అయితే, కిషోర్రెడ్డి ఊరికి వెళ్లాల్సిన ఆ విగ్రహం కాస్తా తన ప్రత్యర్థి రాజకీయ నాయకుడు ఉన్న రాజావారిపల్లెకు వెళ్తుంది. ఇంతకీ ఆ విగ్రహంలో ఏముంది? కిషోర్రెడ్డి ప్రత్యేకంగా ఆ విగ్రహాన్ని తయారు చేయించడం వెనుక కారణం ఏంటి? వినాయకుడి విగ్రహంలో ఉండిపోయిన ఆ వజ్రాన్ని గణేశ్ ఎలా తిరిగి సంపాదించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే
భయం.. అత్యాశ.. కుట్ర.. ప్రతీ మనిషి ఏదోఒక సమయంలో ఈ మూడిరటి గురించి ఆలోచిస్తాడు. ఆయా సందర్భాలు ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకు లేదా కావాల్సింది దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడు. కొన్నిసార్లు ప్రాణాలను సైతం పణంగా పెడతాడు. కథానాయకుడికి ఈ మూడూ పరీక్ష పెడితే వాటి నుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డాడన్నదే ‘గం. గం.. గణేశ్’. ఈ ఎలిమెంటుకి కామెడీ జోడిరచి వినోదాన్ని పంచడంలో దర్శకుడు ఉదయ్శెట్టి పాసయ్యారు. ఒక వస్తువు కోసం గ్రూపులు గ్రూపులుగా వచ్చే కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లే ఎప్పుడూ వర్కౌట్ అవుతుంది. ఈ సినిమాలో కూడా ఒక విగ్రహం కోసం కొన్ని గ్రూపులు ఎందుకు వచ్చాయి అని క్లైమాక్స్ లో రివీల్ చేసి ట్విస్టులు అదరగొట్టారు. ఫస్ట్ హాఫ్ నుంచి నవ్విస్తూనే ఉంటారు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ ట్విస్టులు, కామెడీ ఇంకా బాగుంటాయి. కొన్ని ఊహించని ట్విస్టులు కూడా క్లైమాక్స్ లో రివీల్ చేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. మొత్తానికి నవ్విస్తూనే ఫుల్ గా నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ పెట్టారు. గణేశ్, అతడి లైఫ్ స్టైల్ను పరిచయం చేస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు.. లవ్ ట్రాక్తో అసలు పాయింట్కు రావడానికి కాస్త కథను సాగదీశాడు. ఎప్పుడైతే గణేశ్కి డబ్బు సంపాదించాలన్న కసి పుడుతుందో అప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు గణేశ్ కథ చూపిస్తూనే మరోవైపు కిషోర్రెడ్డి ప్రత్యేక వినాయకుడి విగ్రహాన్ని ముంబయి నుంచి తీసుకొచ్చే ప్లాట్ను సమాంతరంగా నడిపాడు. పోలీసులకు భయపడి గణేశ్ ఆ వజ్రాన్ని వినాయకుడి తొండంలో వేయడం, కిషోర్రెడ్డి తయారు చేయించిన విగ్రహం రాజావారి పల్లెకు వెళ్లడంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో విరామమిచ్చిన తీరు బాగుంది. రాజావారి పల్లెకు చేరిన తర్వాత ద్వితీయార్ధం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రత్యర్థి రాజకీయ నాయకుడి ఊరి నుంచి కిషోర్రెడ్డి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు రుద్ర, అతడి గ్యాంగ్ చేసే ప్రయత్నాలు ఒకవైపు... వజ్రం కోసం గణేశ్, అతడి స్నేహితుడు వేసే ప్లాన్లు ఆద్యంతం నవ్వులు పంచుతూ ద్వితీయార్ధం సాగుతుంది. మతి భ్రమించిన డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్గా వెన్నెల కిషోర్ పాత్ర కనిపించిన ప్రతిసారీ థియేటర్లో నవ్వులే నవ్వులు. డాక్టర్ డేవిడ్ వల్ల అటు రుద్ర గ్యాంగ్, ఇటు గణేశ్ పడే ఇబ్బందులు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ ట్రాక్ మొత్తం హెలేరియస్గా పండిరది. మధ్యలో గణేశ్కు నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ)తో లవ్ ట్రాక్ పెట్టడం అసలు కథ కాస్తకు పక్కకు వెళ్లినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో స్వామీజీ (రాంజగన్) పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇచ్చి అలరించాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలు, తుపాకీలతో కాల్చుకోవడం ‘స్వామి రారా’ క్లైమాక్స్ను గుర్తు చేస్తాయి.
ఎవరెలా చేశారంటే
‘బేబీ’ వంటి లవ్ ఎమోషనల్ డ్రామా తర్వాత ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీతో వైవిధ్యంగా ప్రయత్నించారు. గణేశ్ పాత్రకు ఆయన చక్కగా సూటయ్యారు. ఇప్పటివరకు అన్నీ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ లు చేసిన ఆనంద్ దేవరకొండ మొదటిసారి ఈ సినిమాలో ఫుల్ యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొత్త హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, ఎనర్జిటిక్ గా కనిపించి ఈ సినిమా కోసం కొత్తగా అయితే ట్రై చేసాడు. మొదటిసారి ఆనంద్ డ్యాన్స్ వేసి అదరగొట్టేసాడు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఫుల్ లెంగ్త్ కమెడియన్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించాడు. వెన్నెల కిషోర్ కూడా కడుపుబ్బా నవ్విస్తాడు. విలన్ గా కిషోర్ రెడ్డి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నయన్ సారిక కాసేపే కనపడినా క్యూట్ గా మెప్పించింది. ప్రగతి శ్రీ వాత్సవ సెకండ్ హాఫ్ లో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి అందంతో, నటనతో మెప్పించింది. సత్యం రాజేష్, ప్రిన్స్, కృష్ణ చైతన్య.. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల మేరకు నటించి అలరించారు. ఎక్కడా కూడా అసభ్యతకు తావులేకుండా కామెడీని పండిరచడం మెచ్చుకోదగిన విషయం. సాంకేతికంగా సినిమా బాగుంది. చైతన్ భరద్వాజ్ పాటలు, ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్గా ఉంది. ఉదయ్ బొమ్మిశెట్టి ఎంచుకున్న కథ కొత్తదేమీ కాకపోయినా ఎంటర్టైనింగ్గా చెప్పడంలో పర్వాలేదనిపించారు. ప్రథమార్ధంలో లవ్ ట్రాక్ అవసరం లేదు. దానికి బదులు వెన్నెల కిషోర్ ట్రాక్ పెంచి ఉంటే ప్రేక్షకులు మరింత ఆస్వాదించేవారు. ముఖ్యంగా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఇలాంటి జానర్ లో పలు సినిమాలు వచ్చినా ఈ సినిమా కోసం వాటికి డిఫరెంట్ గా స్క్రీన్ ప్లే రాసుకొని కామెడీ, ట్విస్ట్ లతో అదరగొట్టాడు డైరెక్టర్. మొదటి సినిమాతోనే ఉదయ్ శెట్టి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. పాటలు కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కూడా మెచ్చుకోవచ్చు. కొత్త నిర్మాతలు అయినా బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.