Bhatti Vikramarka: కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా

0

యాదాద్రిలో జరిగిన ఘటనను సామాజిక మాధ్యమాల్లో అర్థంపర్థం లేకుండా ట్రోల్‌ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బంజారాహిల్స్‌లో జరిగిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. సోమవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశామని, కావాలనే తాను చిన్న పీట మీద కూర్చున్నట్లు వెల్లడిరచారు.

అసలేం జరిగిందంటే..

యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పీటలపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు మాత్రం కాస్త ఎత్తు తక్కువ ఉన్న పీటలు వేశారు. ఇది దుమారం రేపింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఈ వీడియోను షేర్‌ చేసి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. యాదాద్రీశుడి సాక్షిగా దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగిందని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు. సీఎం రేవంత్‌ యాదాద్రి పర్యటనలో దళితుడు అనే కారణంతో భట్టిని కింద కూర్చోబెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో తీవ్రంగా ట్రోల్‌ చేశాయి ప్రతిపక్షాలు. ఈ వ్యవహారంపై భట్టి విక్రమార్క తాజాగా స్పందించారు. ఇందులో ఎలాంటి అవమానం లేదని, కావాలనే తాను చిన్న పీటపై కూర్చున్నానని భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. యాదాద్రి ఆలయం వివాదంపై స్పందించిన ఆయన.. తాను కావాలనే చిన్న స్టూల్‌ పై కూర్చున్నట్లు స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. నేను రాష్ట్రాన్ని శాసిస్తున్న వ్యక్తిని, నేను ఎవరికీ తలవంచే వాడిని కాదు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు అని వెల్లడిరచారు. ఇదే విషయంపై కాంగ్రెస్‌ శ్రేణులు స్పందించాయి. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాయి. ఇది కావాలని జరిగిన ఘటన కాదని.. గతంలో రాహుల్‌ గాంధీ పర్యటన సందర్భంగా భట్టి పైన కూర్చుంటే.. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కింద కూర్చున్నారని నాటి ఫొటోలను షేర్‌ చేశాయి. సీఎం రేవంత్‌ రెడ్డి సతీసమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్‌ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉన్నారు. వారికి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ సమయంలో భట్టి విక్రమార్క, కొండా సురేఖ చిన్న స్టూలుపై కూర్చోవడం వివాదానికి తెరలేపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !